38.2 C
Hyderabad
April 28, 2024 20: 50 PM
Slider ఖమ్మం

గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

#Sai Soundarya Rajan

రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ బుధవారం నాటి జిల్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో గవర్నర్ పర్యటనపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బుధవారం మ. 2.30 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం నుండి ఎన్ఎస్పీ అతిథి గృహానికి చేరుకుంటారని, అక్కడి నుండి మ. 3.00 గంటలకు కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల చేరుకొని, కళాశాలలో విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతారని ఆయన అన్నారు. వైద్య బృందం అందుబాటులో ఉంచాలని, ఎన్ఎస్పీ అతిధి గృహం, కిట్స్ కళాశాల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని, రూట్ మ్యాప్ రూపొందించి, ఎలాంటి సమస్యలు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా రెవిన్యూ అధికారిణి ఆర్. శిరీష, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, ఎసిపిలు బస్వా రెడ్డి, ప్రసన్నకుమార్, జిల్లా విద్యాధికారి సోమ శేఖర శర్మ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, జిల్లా రవాణాధికారి కిషన్ రావు, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసరావు, తహశీల్దార్లు శైలజ, సుమ, అధికారులు తదితరులు పాల్గొన్నార

Related posts

నిజాం కాలేజీ బాలికలకు ఎన్ఎస్యూఐ మద్దతు

Satyam NEWS

డిసిసిబి ఎన్నికలపై టిఆర్ఎస్ తుది కసరత్తు

Satyam NEWS

బంగాళాఖాతంలో అల్పపీడనం

Murali Krishna

Leave a Comment