38.2 C
Hyderabad
May 2, 2024 20: 01 PM
Slider ఖమ్మం

పిడమర్తి రవిపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలి

#telanganadandora

రాష్ట్రంలో అనేక చోట్ల దళిత గిరిజన నాయకుల పైన అధికారులు పైన, మహనీయుల విగ్రహాల పైన దాడులు అవమానాలు జరుగుతూనే ఉన్నాయని తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు మీసాల రాము మాదిగ అన్నారు. నిన్న ఖమ్మం జిల్లాలో పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా మాదిగ జేఏసి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పిడమర్తి రవి అక్కడికి వెళ్లడం జరిగింది. అంబేద్కర్ ఐడియాలజీ వ్యతిరేక శక్తులు కొంతమంది దుండగులు పిడమర్తి రవి, అతని అనుచరులపై దాడి చేయడాన్ని తెలంగాణ దండోరా రాష్ట్ర కమిటీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని మీసాల రాము మాదిగ అన్నారు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు అతని అనుచరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ రవి ని స్థానిక ఎమ్మెల్యే కాంతారావు తన అనుచరులతో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అంతరాయం కలిగించాలని చూశారని తెలిపారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని దళిత సంఘాలను కలుపుకొని బహిరంగ క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టమని డిమాండ్ చేశారు.

Related posts

వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ఫ్యాషన్ షో

Satyam NEWS

మనిషి పుర్రెను కాల్పుచుని తింటున్న సైకో

Satyam NEWS

ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ భేటీ

Satyam NEWS

Leave a Comment