హైదరాబాద్ లోని అంబర్ పేట్ బాపూ నగర్ లో రోటరీ ఇండియా లిటరసీ మిషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆషాకిరణ్ సెంటర్ ను అంబర్ పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్ పేట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం మన చుట్టుపక్కల బస్తీలలో చదువు చెప్పించ లేని పేదరికంలో ఉన్న15 సంవత్సరాల లోపు ఉన్నవారికి ఉచిత విద్య అందించడమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఆర్ కే లావణ్య, నిఖిత, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏర్రబోలు నరసింహారెడ్డి, లవంగు ఆంజనేయులు, కె రామారావు యాదవ్, కె లింగరావు, రాగుల ప్రవీణ్ పటేల్, మహమ్మద్ కాలేద్, మహేష్ గంగపుత్ర, మహమ్మద్ గౌస్ దేవేందర్, దయాకర్, లక్ష్మణ్, బబ్లు, శ్రీనివాస్, గోవింద్, వేణు, సంతోష్ చారి, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ అంబర్ పేట్