29.7 C
Hyderabad
April 29, 2024 07: 13 AM
Slider కడప

రాజంపేటలో రైతు సమస్యలపై టీడీపీ నిరసన ర్యాలీ….

#TDPKadapa

రైతు సమస్యలు, పంటలకు మద్దతు ధరలు, వ్యవసాయ మోటర్లకు విద్యుత్ మీటర్లు బిగింపు వంటి సమస్యలపై రాజంపేటలో టీడీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల రాయుడు పండ్లు కూరగాయలతో పాటూ కాడెద్దులు తొలుతూ వినూత్న నిరసన తెలియజేశారు.

కడప జిల్లా రాజంపేట బైపాస్ రోడ్డులోని ఎన్టీ రామారావు విగ్రహంకు, పట్టణంలో ని గాంధీ విగ్రహం,అంబేద్కర్ విగ్రహాలకు పులా మాలలు వేసి నివాళులు అర్పించారు. రాజంపేట తహశీల్దార్ కార్యాలయం వరకు వివిధ పండ్ల

తో కాడెద్దులు తొలుతూ ర్యాలీగా వెళ్లి టీడీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు తహశీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు రైతు సమస్యలు, పంటలకు మద్దతు ధరలు, వ్యవ సాయ మోటర్లకు విద్యుత్ మీటర్లు బిగింపు వంటి సమస్యలపై ఈ నిరసన ర్యాలీ, వినతి పత్రం సమర్పించారు.రాష్ట్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి టీడీపీ నాయకులు,కార్య కర్తలు,అభిమానులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

రాత్రి వేళ సైకిల్ పై ఐ‌పి‌ఎస్

Sub Editor 2

వితంతువులకు సంక్షేమ పథకాలు అందించాలి

Satyam NEWS

పోలీస్ అభ్యర్థులకు ఈవెంట్స్ లో లాంగ్ జంప్ దూరాన్ని తగ్గించాలి

Bhavani

Leave a Comment