విజయనగరంలో .ప్రతి పక్ష టీడీపీ కి చెందిన పోలిట్ బ్యూరో సభ్యుడు… కేంద్ర, రాష్ట్ర మంత్రులు గా పని చేసే అనుభవం ఉన్న వ్యక్తి.. అంతేనా..తమకున్న భూముల ను ప్రజలకోసం ధారాదత్తం చేసిన నేత. ఆయనే పూసపాటి అశోక్ గజపతిరాజు. ఆయన నోటి వెంట నర్మగర్భ వ్యాఖ్యలు వచ్చాయి. అదీ అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర… అలాగే సీఎం జగన్ బాబాయ్ హత్య కేసు…ఈ రెండు అంశాలపై అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలు… అటు పార్టిని ఇటు ప్రజలను ఆలోచన లోకి పడేసాయి. ప్రస్తుత ప్రభుత్వం అనాలోచితంగా వెళుతోందని..ప్రజా సంక్షేమం పట్టని విధంగా వెళుతోందని….ఈ విధానం ప్రజాస్వామ్యానికే మంచి విధానం కాదని కుండబద్దలు కొట్టినట్లు…చెప్పడం విశేషం.
previous post
next post