వైసిపి ప్రభుత్వ హాయంలో నాలుగు సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి చోటు చేసుకోలేదని కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు విష్ణు వర్దన్ రెడ్డి అన్నారు. గత తెలుగుదేశం పార్టీ హాయంలోనే కోడుమూరు నియెజకవర్గంలో అభివృద్ధి చెందిందని వైసిపి ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చోటు చేసుకోలేదన్నారు.
విష్ణు వర్ధన్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుదాకర్ విమర్శించడం సరికాదన్నారు. ఆధారాలు లేకుండా ఎలాంటి విమర్శలు చేయరాదని తెదేపా నాయకులు తెలిపారు. తెదేపా నేత అక్రమాలకు పాల్పడినట్లు ఏమైనా ఆధారాలు ఉంటే చూపాలని వారు తెలిపారు.
ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లి ప్రజల మధ్య గొడవలు పెడుతున్నారని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. వర్ష భావంతో జిల్లా వాసులు తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని తుంగభద్ర నుంచి మనకు రావాల్సిన 1.5 టిఎంసిల నీటిని వెంటనే తీసుకొని రావాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా సుంకేసుల నుంచి పది కిలోమీటర్ల మేరకు ఉసుక తరలించకుండా చూడాలని ఆయన అధికారులు కోరారు.