27.7 C
Hyderabad
May 7, 2024 07: 42 AM
Slider అనంతపురం

ట్రైడ్@క్రైడ్:మంటలనుచూసి పారిపోయినఏటీఎందొంగలు

atm tried

ఏటీఎం బాక్స్‌లో నగదు దొంగిలించేందుకు విఫయత్నం చేసిన దొంగలు మంటలు రావడం తో పలాయనం చిత్తగించారు.ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడం తో అక్కడే తెచ్చిన సామగ్రి వదిలేసి వెళ్లిపోయిన ఘటన అనంతపురం జిల్లా పెనుగొండ కేంద్రంలో జరిగింది.పట్టణంలో ఏక్సిస్‌ బ్యాంకు ఏటీఎంలో ఈ తెల్లవారు జామున ముఖానికి ముసుగు వేసుకున్నఏటీఎం కేంద్రంలోకి వచ్చిన ఓ దొంగ ఏటీఎం పైకి ఎక్కి సీసీ కెమెరాను ఒక గుడ్డతో కప్పేశాడు.

అనంతరం ఏటీఎంను తెరిచేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం గ్యాస్‌ కట్టర్‌ కూడా ఉపయోగించాడు. ఈ ప్రయత్నంలో ఏటీఎం ధ్వంసమైనా నగదు ఉన్న బాక్స్‌లు ఓపెన్‌ కాలేదు. పైగా గ్యాస్‌ కట్టర్‌ ఉపయోగించడం వల్ల ఏటీఎంలో ఒక్కసారి మంటలు చెలరేగాయి.దీంతో భయాందోళనకు గురైన దొంగలు ఎక్కడివక్కడ వదిలేసి పారిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసు దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

పొంగే సంబరం

Satyam NEWS

ఢిల్లీ న్యాయవాదికి బెదిరింపు వచ్చింది రాజంపేట నుంచే

Satyam NEWS

నిద్రలో ఎక్కువ రసాయనాలు పీల్చడం వల్లే ప్రమాదం

Satyam NEWS

Leave a Comment