ఉద్యోగులను కట్టుబానిసలుగా చూస్తూ కేసీఆర్ దొరపాలన చేస్తున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు.
శనివారం ఆయన భద్రాద్రి కొత్తగూడెంలోమీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక ఉద్యోగుల పరిస్థితి మారలేదన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ వచ్చాక కూడా కాంట్రాక్ట్ వ్యవస్థ కొనసాగుతోందన్నారు.
తెలంగాణాలో లక్షా 64 వేల మంది నిర్భంద కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని కోదండరాం మండిపడ్డారు.
కేసీఆర్ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని పట్టభధ్రులు కేసీఆర్కు తగిన గుణపాఠం చెప్పాలని కోదండరాం తెలిపారు.