ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రముఖ సినీ నటులు నేడు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన వారిలో చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్ ఉన్నారు. వారితో బాటు దర్శకులు రాజమౌళి, కొరటాల శివ కూడా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సినీ నటులు పోసాని కృష్ణమురళి, అలీ కూడా నేడు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. దర్శక నిర్మాత నటుడు ఆర్. నారాయణమూర్తి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలను విపరీతంగా తగ్గించి తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల సంక్షోభం సృష్టించిన విషయం తెలిసిందే. దానికి తోడు సినిమా ధియేటర్లపై అధికారులు దాడులు చేయడంతో పలు ధియేటర్లు మాత వేశారు. సినిమా టిక్కెట్లను ప్రభుత్వమే అమ్మే విధంగా ఆన్ లైన్ వ్యవహారాన్ని కూడా జగన్ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు సినిమా టికెట్ల ధరల అంశంపై సీఎంకు వారు వివరించారని అంటున్నారు.
previous post