యాస్ తుపాను ప్రభావం ఉత్తరాంధ్ర ఉంటుందని వాతావరణ హెచ్చరికల దరిమిలా అటు రెవెన్యూ, ఇటు పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఈ మేరకు వాతావరణం హెచ్చరికల ఆధారంగా జిల్లా ఎస్పీ రాజకుమారీ విజయనగరం సబ్ డివిజన్ పోలీసులను అప్రమత్తం చేసారు.
దీంతో ఎస్పీ ఆదేశాలతో జిల్లాలో యాస్ తుఫాను ప్రభావంతో తీర ప్రాంత గ్రామాలైన పూసపాటి రేగ మండలంలోని చింతపల్లి, తిప్పలవలస, భోగాపురం మండలంలోని ముక్కాం, చేపల కంచేరు, ఎఱ్ఱముసలయ్య పాలెం గ్రామాల్లో మత్స్యకారులను అప్రమత్తం చేసేందుకు విజయనగరం డీఎస్పీ అనిల్ కుమార్, భోగాపురం సీఐ శ్రీధర్ మరియు ఇతర ఎసైలు పర్యటించి, మత్స్యకారులను సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని హెచ్చరించారు.