చత్తీస్ ఘడ్ లోని దక్షిణ బస్తర్ సుక్మా,బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతం పామేడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు క్యాంపులపై పోలీసుల వైమానిక దాడులు నిర్వహించారు. బట్టిగూడా,కవర్ గట్టా,మినగట్ట,దబ్బగట్ట ప్రాంతాల్లో మావోయిస్టు క్యాంపులపై డ్రోన్లు, హెలికాప్టర్లతో పోలీసుల మెరుపు దాడులు కొనసాగాయి. గత నెల 25వ తేదీన అమిత్ షా బస్తర్ డివిజన్ పర్యటన అనంతరం పోలీసులు ఈ వైమానిక దాడులు నిర్వహించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకే పోలీసులు ఈ చట్ట వ్యతిరేక దాడులకు పాల్పడుతున్నారని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. వైమానిక దాడులకు పాల్పడుతూ అమాయక గిరిజనుల ప్రాణాలతో పోలీసులు చెలగాటమాడుతున్నారని వారన్నారు. ఈ దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టు పార్టీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి సమత ప్రెస్ నోట్ విడుదల చేశారు.