తెలంగాణ ప్రీమియర్ లీగ్ సీజన్ ఒకటి రెండు అపూర్వ విజయం సాధించిన తర్వాత మూడవ సీజన్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నది. ఇది మార్చి 14 వరకూ కొనసాగుతుంది. హైదరాబాద్ లోని యూసుఫ్ గూడాలోని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియం లో ఈ లీగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు టి సంజయ్ రెడ్డి (లీగ్ కమిషనర్) సి ప్రవీణ్ కుమార్ రెడ్డి (లీగ్ డైరెక్టర్) తెలిపారు.
జాతీయ కబడ్డీ లీగ్ అయిన ప్రో కబడ్డీ లీగ్ కు ప్రాంతీయ రూపం, తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ అని సంజయ్ రెడ్డి తెలిపారు. గత రెండు సీజన్ లలో ఎంతో ఆదరణ పొందిన ఈ లీగ్ మూడవ సీజన్ లోకి ప్రవేశించిందని, దేశ ప్రాచీన క్రీడల పట్ల ప్రజలలో ఉన్న ఆసక్తిని మరింత పెంచేలా ఈ ట్రోఫీ ఉంటుందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ సీజన్ 3 కి చింతల స్పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ మద్దతునిస్తున్నది.
దక్షిణ భారత దేశంలోని డిజిటల్ మీడియా ఎంటర్ టైన్ మెంట్ సంస్థ సిల్లీ మాంక్స్ ఎంటర్ టైన్ మెంట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ సహాయంతో తమ సొంత రాష్ట్రంలో ఈ క్రీడను మరింత ముందుకు తీసుకువెళ్తూ తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ ఏర్పడింది.
తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ తరపును మరో మారు మ్యాచ్ లను ఆస్వాదించాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం కల్యాణ్ చక్రవర్తి ని ఫోన్ నెం 9381340098 పై సంప్రదించవచ్చునని తెలిపారు.