సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం ఆటో డ్రైవర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక పట్టణ ఎస్ఐ వెంకటరెడ్డి పాల్గొని ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని,డ్రైవర్ పక్కన కూర్చోబెట్టుకొని ఎవ్వరుకుడా ఆటో డ్రైవ్ చేయరాదని, ఆటో డ్రైవర్లు తప్పకుండా లైసెన్స్, ఆటో ఆర్.సి, ఇన్సూరెన్స్,పర్మిషన్ పేపర్స్ కలిగి ఉండలని,ఆటోలో టేప్ రికార్డర్లు ఉపయోగించరాదని అన్నారు.
విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ఎటువంటి చుట్ట విరుద్ధమైనవి ట్రాన్స్పోర్ట్ చేయరాదని,చేసిన యెడల డ్రైవర్,ఆటో యజమానిపై కేసులు నమోదు చేయబడతాయని,మైనర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తూ పట్టుబడితే కేసులు నమోదు చేయటం జరుగుతుందని తెలిపారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్