పవిత్రమైన కార్తీక మాసంలో శివాలయాల దర్శనకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. భక్తుల కోసం తక్కువ ఖర్చుతో ఐదు ఆలయాల సందర్శనకు వీలు కల్పించేలా ఈ ప్యాకేజీని రూపొందించినట్లు పేర్కొంది. కార్తీక మాస దర్శిని ప్యాకేజీ-2 పేరుతో తీసుకొచ్చిన ఈ ప్యాకేజీలో అలియాబాద్, వర్గల్, కొమురవెల్లి, కీసర, చేర్యాల ఆలయాలను దర్శించుకోవచ్చని తెలిపింది . హైదరాబాద్ నుంచి ఉండే ఈ ప్యాకేజీ కింద పెద్దలకు రూ.500, పిల్లలకు రూ.300 వసూలు చేయనున్నట్లు వెల్లడించింది,