అమరావతి నుండి హైకోర్టు తరలించవద్దని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంతం అంతా నిరసనలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా అవనిగడ్డ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా రెలే నిరాహార దీక్షలు సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతికి తరలించిన కొద్ది కాలానికే మళ్లీ మార్చడం అన్యాయమని వారు అంటున్నారు.
అమరావతిలో ఇప్పుడిప్పుడే అన్ని వసతులు సమకూరుతున్నాయని హైకోర్టు సజావుగా నడిచే పరిస్థితి ఏర్పడుతున్న సమయంలో మళ్లీ మార్చడం అస్ధిరత్వానికి దారితీస్తుందని వారన్నారు. 3 వ రోజుకు చేరిన అవనిగడ్డ బార్ అసోసియేషన్ న్యాయవాదుల రిలే నిరాహార దీక్షకు పలు సంఘాలు సంఘీభావం వ్యక్తం చేస్తున్నాయి.