అభివృద్ధి పనులలో వేగం పెంచాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. నేడు ఆయన రూ 15 కోట్లతో నిర్మాణం చేపడుతున్న ఇల్లందు BT రోడ్ పనులను తనిఖీ చేశారు. నేటి ఉదయం కోయచెలక క్రాస్ రోడ్ వద్ద కు వెళ్లిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పనుల వేగం పెంచాలని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట MP నామ నాగేశ్వరరావు, R&B EE శ్యామ్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.