బిచ్కుంద మండలంలోని పెద్ద దేవడా గ్రామంలో వాన కాలం పంటలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్ మాట్లాడుతూ పంట మార్పు చేయడం వలన రైతులకు ఎంతగానో ఉపయోగం ఉంటుందన్నారు.
గ్రామంలో వరి 75 ఎకరాలు వరిలో డొద్దు రకాలు 60% (mtu 1010 mtu1061) సన్నారకాలు 40% (RNR15048, HMP, Jai శ్రీరామ్, BPT5204) సోయాబీన్ 500 ఎకరాల్లో, కంది 164 ఎకరాల్లో, మినుము 10 ఎకరాల్లో పెసర 2 ఎకరాల్లో వేయడానికి నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి అశోక్ పటేల్ ఏడీఏ ఆంజనేయులు, వ్యవసాయాధికారి పోచయ్య, సర్పంచ్ శివానంద్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బస్వరాజ్ పటేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గ్రామ రైతులు పాల్గొన్నారు.