39.2 C
Hyderabad
May 4, 2024 19: 50 PM
Slider కరీంనగర్

కరీంనగర్ చేరుకున్న బాహుబలి ఏనుగు

#Baahubali elephant

రేపు సాయంత్రం అంగరంగ వైభవం గా మార్క్ ఫెడ్ మైదానం నుండి ప్రారంభం కానున్న వెంకటేశ్వర స్వామి శోభా యాత్ర లో పాల్గొనడానికి కర్ణాటక నుండి వచ్చిన గజలక్ష్మి ఏనుగు ఈ రోజు కరీంనగర్ చేరుకుంది. మార్క్ ఫెడ్ ఆవరణలో ప్రత్యేక వాహనం లో ఏనుగు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి గంగుల కమలాకర్ మేయర్ సునీల్ రావు, ఏనుగు వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు.

దీనితోపాటు మరో రెండు ఏనుగులు రేపు ఉదయం రానున్నానని మంత్రి తెలిపారు. ఈ ఏనుగు బాహుబలి సినిమాలో, మహానటి సావిత్రి సినిమాలో నటించిందని మావటీ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి, మేయర్ ఏనుగుకు చెరుకు గడలు తినిపించారు. చెరుకు గడలు తిన్న ఏనుగు తొండంతో మంత్రిని దీవించడం గమనార్హం.

మంత్రి వెంట ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, మేయర్ సునీల్ రావు, బీ ఆర్ ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, ఎడ్ల అశోక్ తదితరులు ఉన్నారు.

Related posts

ధాన్యం కొనుగోలులో ఇబ్బంది రానివ్వం

Murali Krishna

మూడు మతాల సాక్షిగా ఏడు అడుగులు వేసిన జంట

Satyam NEWS

అక్టోబర్ 6న సినీబజార్ డిజిటల్ థియేటర్ లో “నీ వెంటే నేను”

Satyam NEWS

Leave a Comment