29.7 C
Hyderabad
May 6, 2024 04: 31 AM
Slider నల్గొండ

ఘనంగా డాక్టర్ బాబు జగ్జివన్ రామ్ జయంతి

#mlasaidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తెరాస పార్టీ కార్యాలయంలో మంగళవారం భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి మహనీయునికి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ బాబు జగ్జివన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని,గత ప్రభుత్వాలు దళితులను కేవలం ఓటు బ్యాంకు గానే ఉపయోగించుకున్నాయని,ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ,సిఎం కెసిఆర్ నేతృత్వంలో దళిత బంధు లాంటి గొప్ప పథకాలను ప్రవేశపెట్టి దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే దళితులకు న్యాయం జరిగేలా దళిత బంధు పేరుతో ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు అందించడం జరుగుతుందని,నేడు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జివన్ రామ్  జయంతి సందర్భంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో దళిత బంధు కార్యక్రమాన్ని ప్రారంభించు కోవడం జరుగుతుందని తెలిపారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

స్పందన ఫిర్యాదులను వారం రోజుల్లో పరిష్కరించాలి

Satyam NEWS

పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ ప్రదీప్ ని అభినందించిన రాచకొండ సీపీ

Satyam NEWS

16 నుంచి శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

Leave a Comment