సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణ ముస్లిం సోదరులందరులు శుక్రవారం నమాజు థనంతరం ముస్లింల మతపెద్ద ముక్తి మహమ్మద్ గౌస్ ఉద్దీన్ పిలుపు మేరకు ముస్లింలందరూ పెద్దల సూచనల మేరకు బైతుల్ మాల్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా సలావుద్దీన్,ప్రధాన కార్యదర్శిగా షేక్ అలీ,కోశాధికారిగా షేక్ రసూల్,ఉపాధ్యక్షుడిగా షేక్ రహీం,ఎస్.కె ఇబ్రహీం, ఎండి రజలి బాబా,ఎండి అల్లావుద్దీన్,కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కమిటీ కాల పరిమితి 3 సంవత్సరాలు ఉంటుందని ముస్లిం సోదరులు తీర్మానించారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, నాయకులు ఎం ఏ మజీద్,ఎండి అజీజ్ పాషా,ఎస్.కె మన్సూర్ అలీ,నవాబ్ జానీ, మిల్లు రహీం భాయ్,జానీ భాషా,డ్రైవర్ ముస్తఫా,జానీ భాయ్,అబ్బాస్, యూసుఫ్, మస్తాన్,సైదా,మోహిన్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్