37.2 C
Hyderabad
May 1, 2024 13: 04 PM
Slider ఆదిలాబాద్

పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములు కావాలి

#Nirmal Police

పరిసరాల పరిశుభ్రత తోనే అంటు వ్యాధులు దరిచేరకుండా ఉంటాయని అందుకోసం పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములు కావాలని నిర్మల్ జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు లన్నారు. ఆదివారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయ ఆవరణలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రారంభం అవుతున్నందున అంటువ్యాధులు ప్రబలే ఆస్కారముందని, కార్యాలయంతో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతివారం కనీసం పదినిమిషాల పాటు పరిసరాల పరిశుభ్రత కోసం సమయం కేటాయించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ వెంకటేష్, సీఐ జాన్ దివాకర్, ఆర్ఐ వెంకటి మరియు ఎస్బీ సిబ్బంది, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఈ నీచుడిని ఏ పేరుతో పిలవాలో మీరే చెప్పండి

Satyam NEWS

తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి కి ఘన నివాళులు

Satyam NEWS

గడపగడపకు హాత్ సే హాత్ జోడో అబియాన్ యాత్ర

Satyam NEWS

Leave a Comment