సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ ఫోన్ ద్వారా టి.పి.సి.సి అధ్యక్షుడు నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న బక్రీద్ పండుగను శనివారం హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో కోవిడ్ – 19 ప్రభుత్వ నియమ నిబంధనలను అమలు పరుస్తూ జరుపుకున్నారు.
పరిమిత సంఖ్యలో హుజూర్నగర్ లోని ఉస్మానియా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హుజూర్ నగర్ ముస్లిం మత పెద్ద ముఫ్తి మహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో బక్రీద్ పండుగ నమాజ్ ‘ఈదుల్ అధా’ ప్రార్థనను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మానవాళిని అనారోగ్యాల పాలు చేస్తూ, ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న కరోనా మహమ్మారిని ఈ ఊరు, ఈ జిల్లా, ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ ప్రపంచం నుండి అల్లా దయతో తరిమి వేయాలని ప్రార్థనలో అల్లాను వేడుకున్నామని చెప్పారు.
బక్రీద్ పండుగ విశిష్టతను ఆయన వివరిస్తూ మహమ్మద్ ప్రవక్త బోధించిన సమైక్యత, సోదరభావాన్ని అందరు అనుసరించాలని శాంతి – సహనం తో సమస్త మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరారు. త్యాగం, భక్తి, విశ్వాసానికి,శాంతి విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి ప్రతీకగా ఏర్పడిందే బక్రీద్ పండగ అని, ప్రార్థనలలో ముస్లిం సోదరులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు ఎండి. అజీజ్ పాషా. ఎస్ కె. మన్సూర్ అలీ.ఎస్ కె. బిక్కన్ సాహెబ్, ఎస్ కె. రహమతుల్లా,ఎస్ కె. జానీ పాషా, ఎస్ కె. మోహిన్,సిరాజ్, ఎండి.రావుఫ్, మౌలాలి,ఎంఎ రహీం, ఎండి. నయీమ్, ఎస్ టి. సాధిక్,రఫీ, నజీర్ తదితరులు పాల్గొన్నారు.