25.7 C
Hyderabad
May 24, 2025 08: 33 AM
Slider హైదరాబాద్

డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న లైంగిక వేధింపులు

#Digital World

డిజిటల్ ప్రపంచంలో మహిళలపైనా, పిల్లలపైనా లైంగిక వేధింపులు రోజు రోజుకూ పెరుగుతున్న మాట వాస్తవం. మరి ఈ అంశాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి? ఈ అంశాన్ని మనలో ఎవరైనా ఆలోచించారా? మనం కచ్చితంగా ఈ సమస్యను ఎదుర్కోవచ్చునని నిపుణులు అంటున్నారు.

ఈ లైంగిక వేధింపులను నిశ్శబ్దంగా భరించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఈ అంశంపై తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం, సింబయోసిస్ లా స్కూల్, హైదరాబాద్ వారి లీగల్ ఎయిడ్ సెంటర్ సంయుక్తంగా ఫేస్ బుక్ లైవ్ ఏర్పాటు చేశారు. నేటి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకూ ఈ ఫేస్ బుక్ లైవ్ ఉంటుంది.

ఇందులో ఐపిఎస్ అధికారిణి రీమా రాజేశ్వరి, ఐఎస్ఏసి రాజశేఖర మూర్తి, సైబర్ పీస్ ఫౌండేషన్ జానిస్ వర్ఘిస్ పాల్గొంటారు. సైబర్ స్పేస్ లో మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపులను ఎలా ఎదుర్కొనాలి అనే అంశంపై ఈ నిపుణులు మాట్లాడతారు.

ఆన్ లైన్ లో లైంగిక వేధింపులు జరకుండా నిరోధించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను వారు వివరిస్తారు. న్యాయపరమైన అంశాలను కూడా ఈ లైవ్ కార్యక్రమంలో నిపుణులు వివరిస్తారు.

(తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం నుంచి సత్యం న్యూస్ ప్రత్యేకం)

Related posts

రాష్ట్రంలో మతతత్వ పార్టీలకు స్థానమే లేదు

mamatha

బీజేపీ ఘోర పరాజయానికి కారణాలు ఇవే

Satyam NEWS

మద్యం సరఫరా చేసే కంపెనీలన్నీ జగన్ వే

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!