34.7 C
Hyderabad
May 5, 2024 00: 48 AM
Slider ఆధ్యాత్మికం

ఏప్రిల్ 21న 8వ విడ‌త‌ అఖండ బాలకాండ పారాయ‌ణం

#tirumala

కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఏప్రిల్ 21వ తేదీన గురువారం 8వ విడ‌త‌ అఖండ బాలకాండ పారాయణం జ‌రుగ‌నుంది. నాదనీరాజనం వేదికపై ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

బాలకాండలోని 33 నుండి 37 సర్గల వ‌ర‌కు గ‌ల 134 శ్లోకాలను పారాయణం చేస్తారు. ఎస్.వి. వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి. వేద విశ్వవిద్యాలయం, టిటిడి వేదపండితులు, టిటిడి సంభావన పండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాల అధికారులు, పండితులు, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తులు ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

Related posts

‘‘వైఎస్ఆర్ దాడి పథకం’’ ఇకనైనా ఆపండి

Satyam NEWS

ఎటెన్షన్: రైతన్నలూ రైస్ మిల్లర్స్ తో జాగ్రత్త

Satyam NEWS

యునానిమస్: వైసిపి ఖాతాలో తొలి ఏకగ్రీవం

Satyam NEWS

Leave a Comment