39.2 C
Hyderabad
April 30, 2024 21: 26 PM
Slider ప్రత్యేకం

నగర బాట సందర్భంగా జహీరాబాద్ లో మంత్రి హరీష్ సైకిల్ యాత్ర

#ministerharishrao

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నేడు నిర్వహించిన నగర బాట కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పలు వార్డు లలో సైకిల్ పై పర్యటించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలిస్తూ స్థానికులు, మహిళలను కలుస్తూ సమస్యలు అడిగి తెలుసుకొని, వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. మంత్రితో పాటు ఎమ్మెల్యే మాణిక్ రావు, పార్టీ జిల్లా అధ్యక్షులు చింత ప్రభాకర్, Tsmsidc ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పార్టీ నాయకులు, జిల్లా, మున్సిపల్ అధికారులు ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో సైకిల్ యాత్ర చేసి ఇంటింటికి వెళ్లి సమస్యలు గుర్తించామని తెలిపారు. కాంగ్రెస్ నుంచి డాక్టర్ జె. గీతారెడ్డి రెండు సార్లు గెలిచినా, మంత్రిగా ఉన్నా అభివృద్ధి మాత్రం చేయలేదని, మాటలకే పరిమితం అయ్యారు తప్ప పనులు చేయలేదని హరీష్ రావు అన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే మాణిక్యరావు కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రు. 50 కోట్లు జహీరాబాద్ పట్టణ అభివృద్ధి కోసం మంజూరు చేశారని హరీష్ రావు తెలిపారు.

గతంలో కూడా జహీరాబాద్ పట్టణం కోసం 25 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. వీటితో ఫోర్ లైన్ రోడ్ లు, బటర్ ఫ్లై లైట్లు ఏర్పాటు చేసుకోవడంతో పాటు వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు జరిగిన సైకిల్ యాత్రతో ఏ ఏ వార్డుల్లో ఏ సమస్యలు ఉన్నాయి అని అధికారులతో కలిసి గుర్తించాము. అవసరం అయిన చోట నాలాలు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకోబోతున్నాం అని ఆయన తెలిపారు.

జహీరాబాద్ ఒకప్పుడు నీళ్లు లేక ఇబ్బంది పడ్డ ప్రాంతం మిషన్ భగీరథ వల్ల ఆ సమస్యకు పరిష్కారం దొరికిందని, 19 కోట్లతో పట్టణాల్లో కొత్త పైప్ లైన్ పనులు పూర్తి దశకు వచ్చింది. జహీరాబాద్ పట్టణ ప్రజలకు తాగునీరు పూర్తిగా అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

రైల్వే బ్రిడ్జి పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించాము. రాబోయే రోజుల్లో జిల్లాలోని అన్ని మున్సిపాలిటిల్లో సైకిల్ యాత్ర చేస్తాను. సమస్యలు గుర్తించి పరిష్కారం చేస్తాము. రు. 3000 కోట్లతో సంగమేశ్వర ద్వారా గోదావరి నీళ్లను తెలంగాణ లోని అత్యంత ఎత్తైన మోగుడంపల్లికి తెస్తున్నాము. కేసీఆరే వల్లే గోదావరి నీళ్ళు ఇక్కడికి వస్తున్నయి. లక్ష ఎకరాలకు నీళ్ళు అందించ బోతున్నం అని మంత్రి వెల్లడించారు.

NIMZ మొదటి ఫేస్ అనుమతి వచ్చింది. డిఫెన్స్ ఫ్యాక్టరీ రాబోతుంది. మరిన్ని కంపెనీలు తీసుకురావడం జరుగుతుంది. మరోవైపు గోదావరి నీళ్ళు వస్తాయి. మొత్తంగా ఈ ప్రాంతం రూపురేఖలు మారబోతున్నది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు స్థానికులకే ఇక్కడి పరిశ్రమల్లో ఉద్యోగాలు దక్కనున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు.

Related posts

హైకోర్టు తీర్పుతో ఆనందోత్సాహాలలో ఉండవల్లి వాసులు

Satyam NEWS

సింగరాజుపల్లి, గొట్టిముక్కుల రిజర్వాయర్లకు నిధులు కావాలి

Satyam NEWS

తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా దుర్గాప్రసాద్

Satyam NEWS

Leave a Comment