బండారు బాలానంద సంఘం విజయనగరం ఉండారు చిన్న రామారావు నిర్వహించిన కథ పఠనం,బాలగేయాల పోటీలలో ప్రతిభ కనపరిచిన బాలబాలికలకు బుధవారం కల్వకుర్తిలో అవోపా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
లాక్ డౌన్ సమయంలో ఆంధ్రప్రదేశ్ బాల సుధా విజయనగరం జిల్లా వారు అంతర్జాలం ద్వారా నిర్వహించిన పోటీలకు అచ్చంపేట కు చెందిన తెలుగు ఉపాధ్యాయురాలు డాక్టర్ పోలసాయి జ్యోతి ప్రోత్సాహంతో కల్వకుర్తికి చెందిన బిల్ల కంటి వెంకటేశ్వర్ల కుమార్తెలు బిల్లకంటినిఖిత, బిల్లకంటిఅస్మిత రెండు పోటీలలో పాల్గొని ప్రతిభ కనపరిచారు.
వారికి ప్రశంసాపత్రాలను కల్వకుర్తిలో అవవోపా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు తన చేతుల మీదుగా అందజేశారు.