మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత శశిధర్ రెడ్డి మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ లో చేరారు. ఆయనతో పాటు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు కూడా చేరారు. ఆయనకు గులాబి కండువా కప్పి పార్టీలోకి మంత్రి హరీశ్ రావు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డబ్బుతో మెదక్ ప్రజల ఆత్మగౌరవం కొనలేరు. మెదక్ అడ్డాలో డబ్బు సంచులు పని చేయవు. ప్రజల మీద ప్రేమ ఉండాలి. ప్రజలకు సేవ చేయాలి. అలా చేసే పార్టీ బీఆర్ఎస్ కాబట్టే శశిధర్ రెడ్డి చేరారని ఆయన అన్నారు.
మెదక్ లో బీఆర్ఎస్ కు హ్యాట్రిక్ గెలుపు ఇవ్వాలి. ఎమ్మెల్యే పద్మ మెదక్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు అని మంత్రి అన్నారు. ఎమ్మెల్యే పద్మ వల్ల మెదక్ జిల్లా అయ్యింది. మెడికల్ కాలేజీ వచ్చింది. రైల్ వచ్చింది. ఘన్ పూర్ ఆనకట్ట నీళ్ళు వదలాలని ధర్నాలు చేసే రోజులు లేవు. రెండు పంటలకు నీళ్ళు ఇస్తున్నది కేసియర్. కరెంట్ నిరంతరం ఇస్తున్నారు అని హరీష్ రావు అన్నారు. ఎండాకాలంలో కూడా పంటకు నీళ్ళు అందుతున్నాయి. గుంట కూడా ఎండటం లేదు. కంటి వెలుగుతో ప్రతి ఇంట్లో వెలుగు నిండుతున్నది అని ఆయన అన్నారు.