28.7 C
Hyderabad
May 6, 2024 10: 50 AM
Slider ముఖ్యంశాలు

భాగ్యనగర్ యువకులారా…. మజ్లిస్ సవాల్ ను స్వీకరించండి

#bandi

పైదరాబాద్ లో కార్వాన్ ఛత్రపతి శివాజీ శోభాయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో మజ్లిస్ ను తరిమికొడతామని అన్నారు. భాగ్యనగర్ ప్రజలంతా మజ్లిస్ సవాల్ ను స్వీకరించి పోరాడాలని పిలుపునిచ్చారు. యువకులంతా 8 నెలలపాటు సమయమిస్తే… తెలంగాణలో రామ రాజ్యాన్ని తీసుకొచ్చే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని చెప్పారు.

ఒవైసీ కళ్లల్లో ఆనందం చూసేందుకు కలశం, మామిడితోరణాలతో తెలుగు సంస్క్రుతి ఉట్టిపడేలా ఉన్న సచివాలయాన్ని కూల్చేసి కొత్త భవనం పేరుతో డోమ్ లను నిర్మించారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే సచివాలయ డూమ్ లను కూల్చి తెలంగాణ సంస్క్రతి ఉట్టిపడేలా మార్పులు చేస్తామన్నారు.  ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని కార్వాన్ లో శివాజీ మహారాజ్ సేవాదళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభా యాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….ఓ సారి చూడండి.. భాగ్య నగర్ యువకులారా…. హిందువుల దమ్మేందో చూపించే రోజు వచ్చింది.. ..12 శాతం ఓట్లున్న పార్టీ తెలంగాణలో 7 సీట్లు గెలిస్తే… మరి 80 శాతం ఓట్లున్న వాళ్లు ఎన్ని సీట్లు గెలవాలి?..

నేనేనాడూ ముస్లింలను, క్రైస్తవులను కించపర్చలే… 15 నిమిషాల టైమిస్తే హిందువులను నరికి చంపితామంటే ఊరుకుందామా? వీపంతా సాఫ్ చేయాలే.. మనం శివాజీ వారసులం…. శివాజీ ఏనాడూ ఔరంగజేబు వద్ద తలవంచలేదు. తుల్జాభవానీకి మొక్కి కత్తి చేతపట్టి యుద్దం చేసి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఔరంగజేబు ఆస్థానంలోని రాజా మాన్ సింగ్ టైపు… నేనే నిఖార్సయిన హిందువనని పూజలు చేస్తూ తన బూతు పత్రిక నమస్తే తెలంగాణలో ఫోటోలు వేయించుకుంటాడు.. రజాకార్ల వారస పార్టీ వద్దకు పోయి మోకరిల్లుతాడు. హిందుత్వాన్ని తాకట్టు పెడతాడు. పటాన్ చెరువులో శివరాత్రి రోజున టీవీ చూస్తే బాధేస్తుంది. శివ రాత్రి రోజున డిస్కో  డ్యాన్సులు వేస్తూ నువ్వు వస్తానంటే… నేను వద్దంటానా? అంటూ గలీజు పాటలు పాడుతున్నారు. ఊరుకుందామా? అన్నా… నేను బరాబర్ హిందుత్వమే మాట్లాడతా… మజ్లిస్ ఇక్కడ తప్ప యాడైనా పోటీ చేస్తుందా? ఎందుకు చేయడం లేదు.. మీకు చేతగావడం లేదని సవాల్ చేస్తూ మజ్లిస్ పార్టీ పాతబస్తీలోనే పోటీ చేసి గెలుస్తున్నాడు.. భాగ్యనగర్ హిందువులారా….. వాడి సవాల్ ను స్వీకరించండని… హిందుత్వ దమ్మేంటో చూపండని… హిందూ సమాజం సంఘటిత శక్తిగా ప్రదర్శించండి. మజ్లిస్ సంగతి చూడండని కోరారు. భాగ్య నగర్ ఎన్నికల్లో చూపిన తెగువ స్పూర్తితో పోరాడి మజ్లిస్ ను ఓడించండని…తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కోరారు.

మజ్లిస్.. నువ్వు మగాడివైతే.. నువ్వ మగాడి కోసం పనిచేస్తే… తెలంగాణలో 119 స్థానాల్లో పోటీ చేయ్… నీకు డిపాజిట్లు రాకుండా చేస్తా… నువ్వొస్తావా? టీఆర్ఎస్ , కాంగ్రెస్ ను సంకలేసుకుని వస్తవా? రా… బీజేపీ సింహం… సింగిల్ గా వస్తది. బీజేపీ గాండ్రింపులను తట్టుకోలేక చెవుల్లో రక్తం పడి చస్తారు.. మోడీ దేవుడన్నా.. సచివాలయం చూడండన్నా… సెల్ఫీ దిగి చూడండి ఏం కనబడుతుందని…  తాజ్ మహల్ లెక్క కనబడుతుంది… ఒవైసీ కుటుంబం కళ్లలో ఆనందం చూడటానికి సచివాలయానికి డూమ్ లను కడుతున్నాడని సంజయ్ ఆరోపించారు. గతంలో సచివాలయం భవనానికి తెలుగు సంస్క్రుతి ఉట్టిపడేలా కళశం, మామిడి తోరణాలుండేవని…

మరి ఇప్పుడు వాటిని ధ్వంసం చేసి డూ మ్ లను కడుతున్నాడని…. మనం ఊరుకుందామా? ప్రసక్తే లేదు. డూ మ్ లను కూల్చి వేస్తామని.. తెలంగాణలో హిందుత్వ వాతావరణం కన్పిస్తోందని.. ఊరూరా కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయని… ఈ రాష్ట్రంలో రంగు రంగుల జెండాలకు స్థానం లేకుండా కాషాయ జెండాను రెపరెపలాడాలని నొక్కి చెప్పారు… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. పాతబస్తీ మాదే… హైదరాబాద్ మాదే… పాతబస్తీకి రావాలంటే నా పర్మిషన్ తీసుకోవాలంటూ ఒవైసీ సవాల్ చేస్తే అన్నీ మూసుకుని ఫాంహౌజ్ లో పడుకున్న వ్యక్తి కేసీఆర్…

మీ అందరి మద్దతుతో సవాల్ స్వీకరించిన… మోడీ వారసుడిగా నేనొచ్చిన. టైం, డేట్, ప్లేస్ చెప్పి వచ్చానని. పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు… చెప్పిన సమయానికి భాగ్యలక్ష్మీ ఆలయం వద్దకు వచ్చి బహిరంగ సభను ఏర్పాటు చేస్తాం…దమ్ముంటే ఆపేద్దామని సవాల్ విసిరానని పాదయాత్ర ఘటన గుర్తు చేశారు… కరీంనగర్ ఎంపీ . విజయం సాధించి  హిందువుల దమ్మేందో చూపించామని…

జై శ్రీరాం… భారత మాతాకీ జై అంటూ సత్తా చూపామని… ఒక్క శివాజీ తల్చుకుంటేనే హిందూ ధర్మ రక్షణ సాధ్యమైందని.. మనం శివాజీ లెక్క మనం ఎందుకు తయారు కావడం లేదని అన్నారు… టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హిందువులకు ఏం పనిలేదన్నడు…రోజుకో దేవుడిని మొక్కుతారని చులకనగా మాట్లాడిండు…ఎస్…మేం రోజుకో దేవుడిని మొక్కుతాం… వారానికో పండుగ చేసుకుంటాం… నీకేం నొప్పి? హిందువుగా పుట్టడం పూర్వ జన్మ సుకృతం అని.. భారతీయుడిగా పుట్టడం అదృష్టమని హిందూ ధర్మ రక్షణ కోసం త్యాగం చేయడానికే వెనుకాడొద్దు…

అయ్యప్ప స్వామిని, సరస్వతి అమ్మవారిని కించపర్చినా, సనాతన ధర్మాన్ని, సంఘాలను చీలుస్తుంటే చూస్తూ ఊరుకుందామా? కుహానా శక్తులు రెచ్చిపోతుంటే మౌనంగా ఉందామా? ఇట్లానే ఉంటే మీరు కంకణం కూడా కట్టుకోలేరని… బొట్టు కూడా పెట్టుకోలేని పరిస్థితి వస్తుందని సంజయ్ అన్నారు. ఈ పరిస్థితిని మారుద్దామని అన్నారు… బండి సంజయ్. బొట్టు పెట్టుకుని, కంకణం కట్టుకుని నేను హిందువునని సగర్వంగా తిరిగే రోజు రావాలంటే… రామ రాజ్యం రావాలి… రామ రాజ్య స్థాపనకు మేం సిద్ధం… మీరు సమయం ఇవ్వండని కోరారు. రాబోయే 8 నెలలు కాషాయ జెండా ఎగరేసేందుకు కష్టపడదామని చెప్పారు. రామరాజ్య స్థాపన కోసం రాబోయే 8 నెలలపాటు ఉద్యోగాలను, వ్యాపారాలను పక్కనపెట్టి పూర్తి సమయం కష్టపడదామని అన్నారు.

తెలంగాణలో హిందూ వాతావరణం ఉంది కాబట్టే కుహానా శక్తులు భయపడి కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ కుట్రలను భగ్నం చేసి గొల్లకొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడిద్దామని గట్టిగా అన్నారు. ఈ యుద్దంలో మీరంతా సైనికులు కండని… శివాజీ మహారాజ్ స్పూర్తితో పోరాడి ఓటు అనే ఆయుధంతో తెలంగాణలో హిందువుల దమ్మేందో చూపిద్దామని స్పష్టం చేశారు. ఈ పవిత్ర యజ్ఝంలో మీరంతా భాగస్వాములు కావాలని కోరుతున్నానని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు.

Related posts

చెత్త సక్రమంగా ఎత్తకపోతే పన్ను ఎందుకు కట్టాలి ?

Satyam NEWS

ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ వాగిన వారు ఇప్పుడు జవాబు చెప్పాలి

Satyam NEWS

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దుష్ప్రచారాలపై పోరాటం తప్పనిసరి

Satyam NEWS

Leave a Comment