భారతీయ రైల్వే యొక్క అత్యంత ప్రతిష్టాత్మక రైలు – వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ రైలును 15 జనవరి సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య ప్రవేశపెట్టారు . ఈ నెల వ్యవధిలో రైలు వినియోగదారుల నుండి ఉత్సాహభరితమైన స్పందన పొందింది. ఈ రైలు నాలుగు మధ్యంతర స్టేషన్లు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి లలో ఆగుతుంది. ఈ మధ్యంతర స్టేషన్లలో కూడా ప్రయాణికుల నుండి మంచి ఆదరణ, ఆశాజనకమైన స్పందన లభిస్తోంది .తెలంగాణలో ఖమ్మం ముఖ్యమైన నగరం.
పగటిపూట ఈ ప్రీమియర్ ఎక్స్ప్రెస్ రైలును ప్రవేశపెట్టడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు మంచి ప్రయాణ సౌకర్యం లభించింది. ఈ నెల రోజుల్లో ఖమ్మం నుంచి వరంగల్, సికింద్రాబాద్లకు 1,182 మంది ప్రయాణికులు ప్రయాణించగా , విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం వైపు మరో 2,768 మంది ప్రయాణికులు ప్రయాణించారు. మరోవైపు విశాఖపట్నం వైపు నుంచి 1,274 మంది ప్రయాణికులు ఖమ్మం స్టేషన్ కు రాగా, మరో 1,806 మంది సికింద్రాబాద్ వైపు నుంచి ఖమ్మం వరకు ఈ వందే భారత్ రైలులో ప్రయాణించారు.
ఖమ్మం స్టేషన్ నుండి ప్రతిరోజూ సగటున 95 మంది వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కుతున్నారు , మరో 106 మంది ప్రయాణికులు ఖమ్మం స్టేషన్లో ప్రతిరోజూ ఈ రైలు ద్వారా దిగుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక రైలును ప్రవేశపెట్టినప్పటి నుండి, రైలు ప్రయాణీకుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది . ఇరువైపులా ( సికింద్రాబాద్ నుండి విశాఖ మరియు విశాఖ నుండి సికింద్రాబాద్ ) కు పూర్తి సామర్థ్యంతో నడుస్తోంది. 16 జనవరి 2023 న రైలు సర్వీసును ప్రవేశపెట్టినప్పటి నుండి రైలు రెండు దిశలలో దాదాపు 140% సగటు ఆక్యుపెన్సీ తో నడుస్తోంది. ఖమ్మం నుండి రైలు ప్రయాణీకులు కూడా ఈ సెమీ-హై స్పీడ్ రైలులో ప్రయాణించడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు