తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన కోలా నాగేశ్వరరావును మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్, జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్ ఆదివారం హుజూర్ నగర్ పట్టణంలో పూలమాలలతో,శాలువాలతో ఘన సన్మానం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యలను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్