ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని కొత్తపల్లి లో 41వ గురు కృప దినోవత్సవం జరిగింది. బంజారా దీక్షా భూమిలో సంత్ తపశ్శవ్వి ధర్మగురు రామారావు మహరాజ్ సేవాలాల్ మందిరం లో ప్రేమసింగ్ మహరాజ్ ఆధ్వర్యంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. బంజారాలు ఘనంగా నిర్వహించుకునే గురు శిష్యులు కలిసే దినోత్సవం కావడంతో పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు.
సేవాలాల్ దీక్షా భూమి జాతర లో గంగపూర్ తండా నుండి పల్లకి తీసుకుని భక్తుకు పాదయాత్ర గా బంజారా మహిళలు వెళ్లారు. పాటలు పాడి నృత్యాలు చేస్తూ కొత్తపల్లి కి చేరుకున్నారు. అనంతరం పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్థన్ తదితరులు పాల్గొన్నారు.
వచ్చే జాతర నాటికి ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని ఈ సందర్భంగా నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోథ్ జడ్పీటీసీ అనిల్, AIBS రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా శ్యామ్ నాయక్, స్థానిక సర్పంచ్ రాథోడ్ రమేశ్వర్ దిగంబర, నార్నూర్ ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీపీ.వైస్ ఎంపీపీతో పాటు పలువురు పాల్గొన్నారు.