32.2 C
Hyderabad
May 8, 2024 12: 14 PM
Slider వరంగల్

మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి

rao Padma bjp

ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లు అందరు రానున్న మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని రిటైర్డ్ టీచర్స్ & ఎంప్లాయిస్ సెల్ రాష్ట్ర చైర్మన్ మాజీ ఎమ్మెల్సీ బి మోహన్ రెడ్డి కోరారు. ఈరోజు బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా కార్యాలయంలో రిటైర్డ్ టీచర్స్ & ఎంప్లాయిస్ సెల్ రాష్ట్ర కో – చైర్మన్ పులి సర్రోతం రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లాల రిటైర్డ్ టీచర్స్ & ఎంప్లాయిస్ సెల్ కన్వీనర్లు, కో కన్వీనర్ల సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన బి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కారం కావాలంటే రానున్న మున్సిపల్ ఎన్నికలలో అధికార టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి  కనువిప్పు అయ్యే విధంగా బీజేపీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.

 ఉద్యోగస్తులకు పి.ఆర్.సి ఇస్తామని సిఎం పిట్టా కథలు చెప్పాడు తప్ప అది అందని ద్రాక్షగా నిలిచిపోయిందని ఎద్దేవా చేసారు. రాష్ట్రం లోని 555 మండలాలకు రెగ్యులర్ మండల విద్యాశాఖ అధికారులు ఉండాలి కానీ కేవలం 35 మంది మాత్రమే ఉన్నారని ఆయన తెలిపారు. ఇది ఈ బంగారు తెలంగాణాలోని పరిస్థితి అని అన్నారు.

బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నిరంతరం దేశ అభివృద్ధి కొరకు పనిచేస్తుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్ వరకే  పరిమితమై కుటుంబ బాగు కోసం నిరంతరం తాపత్రయ పడుతున్నాడని ఆరోపించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు అందరు కూడ బీజేపీకి బాసటగా నిలిచి మున్సిపల్ ఎన్నికలలో కమలం జెండా వెంట కదలాలని కోరారు.

ఈ సందర్బంగా బీజేపీ రిటైర్డ్ టీచర్స్ & ఎంప్లాయిస్ సెల్ రాష్ట్ర కో – చైర్మన్ గా  పుప్పాల సమ్మయ్య ను, వైస్ చైర్మన్ గా బమండ్లపెల్లి మల్లయ్యని నియమిస్తున్నట్లు మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ సమావేశంలో బీజేపీ రిటైర్డ్ టీచర్స్ & ఎంప్లాయిస్ సెల్ రాష్ట్ర కో – చైర్మన్లు వెంకట్ రెడ్డి, తిరువరంగం ప్రభాకర్, విజయలక్ష్మి, నాయకులు పుప్పాల సమ్మయ్య, బి. మల్లయ్య, శ్రీనివాస్ రెడ్డి, నర్సింహా చారి, మల్లరెడ్డి,  సూర్య ప్రకాష్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ధరణి తో లక్షల కోట్ల కుంభకోణం

Bhavani

విపత్తు సంభవిస్తే తక్షణమే సాయం అందిస్తాం

Satyam NEWS

త్వరలోనే కొల్లాపూర్ కు రానున్న కేంద్ర మంత్రులు

Satyam NEWS

Leave a Comment