బ్యాంక్ ఆఫ్ బరోడా 115 వ వార్షికోత్సవం హనుమకొండ లోని స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రయం లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా బ్యాంకు తరపున పిల్లల కోసం బీరువా, రెండు మంచాలను, మిఠాయిలు అందచేశారు.
ఈ కార్యక్రమానికి అనురాగ్ సొసైటీ ప్రెసిడెంట్ అనితా రెడ్డి అధ్యక్షత వహించగా బ్యాంక్ మేనేజర్ శరత్ బాబు కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ శరత్ బాబు మాట్లాడుతూ బ్యాంకు వేడుకలు పిల్లల మధ్య జరుపుకోవడం వారికి కావలసిన సామగ్రిని అందించడం సంతోషముగా ఉందని అన్నారు. బ్యాంకు కేవలం ఖాతాదారులకు సేవలను అందించడమే కాకుండా సామాజిక సేవలను అందించాలని ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.
డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల సేవ దైవసేవతో సమానమని బ్యాంక్ వారు పిల్లలకు అవసరమైన వస్తువులను అందించి అందరికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. అనాధ ఆశ్రమాలకు, దివ్యాంగులకు ప్రతి ఒక్కరూ తోచిన మేర సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆశా జ్యోతి, ఓమ్ ప్రకాష్, మహేష్, చంద్ర, సుచరిత, వసుధ, పాల్గొన్నారు.