38.2 C
Hyderabad
May 2, 2024 21: 30 PM
Slider ఖమ్మం

పువ్వాడను కలిసిన బార్ కమిటి.

#bar association

ఖమ్మం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు దిశాల కృష్ణారావు, ఉపాధ్యక్షుడు మాదిరాజు, ప్రధాన కార్యదర్శి మన్నేపల్లి బసవయ్య, ట్రెజరర్ ప్రవీణ్ కుమార్, జాయింట్ సెక్రెటరీ విజయ రాఘవ, స్పోర్ట్స్ సెక్రటరీ రావుల వెంకట్, లేడీ రిప్రజెంటేటివ్ కేవీపీ లక్ష్మి, ఈసీ మెంబర్ సింగం జనార్ధన్ లను శాలువాతో సత్కరించారు. ఖమ్మం లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తుందని, బి‌ఆర్‌ఎస్  పార్టీ తలపెట్టిన ఏ ఉద్యమమైనా ముందుండి నడిపించేది లీగల్ సెల్ విభాగమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రత్యర్థులు ఎవరైనా వారి కుతంత్రాలను తిప్పికొట్టాలని, తొండి మాటలకు, తొండి చేస్టలను ఎదుర్కొని వచ్చే ఎన్నికల్లో కేసీఅర్ ని గెలిపించుకుని ప్రత్యర్థులకు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. అనంతరం న్యాయవాదులు బి‌ఆర్‌ఎస్ లీగల్ సెల్ లో చేరారు. వారికి మంత్రి పువ్వాడ బి‌ఆర్‌ఎస్  పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.  కార్యక్రమంలో దిరిశాల కృష్ణారావు, మన్నేపల్లి బసవయ్య, మేకల సుగుణ రావు, కొత్త వెంకటేశ్వరరావు, బిచ్చల తిరుమలరావు, పసుపులేటి శ్రీనివాస్, పొట్ల శ్రీకాంత్, బెల్లం ప్రతాప్, ఇర్షాద్, ఇమ్మడి లక్ష్మీనారాయణ, సింగం జనార్దన్ గౌడ్, బత్తుల బసవ పున్నయ్య తదితరులు ఉన్నారు.

Related posts

సింగపూర్ అనుకుంటున్నారా? కాదు… మన సిద్దిపేట

Satyam NEWS

అరుదైన మైలురాయి చేరుకున్న స్టార్టప్ లు

Satyam NEWS

అవసరమైన ప్రత్తి మిరప పంటలకు విత్తనాలు సిద్ధం చేయాలి

Satyam NEWS

Leave a Comment