నిర్మల్ జిల్లా బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలను ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల ఆదేశాల మేరకు ఆలయ అధికారులు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అనుమతి ఇచ్చారు.
వివిధ ప్రత్యేక ఆర్జిత సేవ పూజలు, అభిషేకం, హారతి, అక్షరాబ్యాసం పూజలు చేసేందుకు ఆలయ అర్చకులు నడుంబిగించారు.
చాలా కాలం తర్వాత వీలు కల్పించడంతో అమ్మవారిదర్శనానికి భక్తులు బారులు తీరారు. లాక్ డౌన్ కారణంగా సుమారు ఐదు నెలల నుండి అర్జిత సేవలు నిలిచిపోయాయి.
రాష్ట్ర దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాసర అమ్మవారి ఆలయం లో నేటి నుండి అక్షరాభ్యాస సేవలతో పాటు ఇతర అర్జిత సేవలు మొదలు పెట్టారు.