వసతి గృహ విద్యార్థులకు మౌళిక వసతుల కల్పన చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ నయాబజార్ బిసి బాలుర వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలను వసతి, మెనూ గురించి అడిగి తెలుసుకున్నారు. వసతిగృహంలో గదులు పరిశీలించారు.
ఎన్ని టాయిలెట్ బ్లాకులు ఉన్నవి పరిశీలించి, పిల్లలకు సరిపోవునంతగా లేవని, టాయిలెట్ బ్లాకు నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. పిల్లలు ఏ పాఠశాలలో చదువుతున్నది, ట్యూటర్, పిల్లల చదువు విషయమై అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ తరగతులు పిల్లలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పరిశుభ్రతను పాటించాలని, ఆవరణలో నీరు నిల్వ కుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.