28.7 C
Hyderabad
May 6, 2024 02: 54 AM
Slider మహబూబ్ నగర్

ప్రజలు స్వీయ నిర్భందాన్ని కచ్చితంగా పాటించాలి

guvvala balaraj

అచ్చంపేట  నియోజకవర్గ పరిధిలో అమలవుతున్న లాక్ డౌన్ పరిస్థితిపై స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో నేడు జరిగిన ఈ సమీక్ష సమావేశంలో డీఎస్పీ,  ఆర్డీవో ,  మున్సిపల్ చైర్మన్ తులసీరామ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కరోనా వైరస్ కట్టడికి కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత పకడ్బందీగా చర్యలు చేపడుతున్నందున నియోజక వర్గ ప్రజలు సహకరించి స్వీయ నిర్బంధం లో ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు.

ఏమైనా   సమస్యలు ఎదురైతే తనకు వ్యక్తి గతంగా ఫోన్ లో తెలియచేయాలన్నారు. తన కోసం క్యాంపు కార్యాలయానికి రాకూడదని ఆయన తెలిపారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ యుద్ధం లో  మనమందరం భాగస్వాములై గెలుపొందాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.  వ్యక్తి గత పరిశుభ్రత తో  పాటు సామాజిక బాధ్యత ను నెరవేర్చాలని  ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కోరారు.

Related posts

`ఆర్ఆర్ఆర్` చిత్రం విడుదల వాయిదా

Satyam NEWS

జగన్‌ రెడ్డి కోటరీలో చిచ్చు పెట్టిన లోకేష్‌

Satyam NEWS

రష్యా సైన్యంలో చేరాలని యూనివర్సిటీ విద్యార్థులపై వత్తిడి

Satyam NEWS

Leave a Comment