తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం అయిన హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నేడు ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, పార్టీ ఉపాధ్యక్షులు కాట్రగడ్డ ప్రసూన, నందమూరి సుహాసిని, తెలుగు మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న పాల్గొన్నారు.
మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ను ఆడారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను సర్వాంగ సుందరంగా అలంకరించారు.