హైదరాబాద్ అంబర్ పేట్ నియోజకవర్గంలోని గోల్నాకలోని హరాస్పెంట హిందూ స్మశాన వాటికను సుందరీకరించి మహాప్రస్థానంలా తిర్చిద్దితున్నాని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు.
సోమవారం గోల్నాక డివిజన్ లో మేయర్ బొంతు రామ్మోహన్, జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి హిందుస్మశాన వాటికలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి చర్చించారు.
స్మశాన వాటిక అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతుల ఏర్పాటు, స్నానాల గదుల నిర్మాణం, చుట్టూ ప్రహరీ గోడను నిర్మించడం, టైల్స్ వేయడం, స్మశాన వాటికలో ఉన్న ఎలక్ట్రికల్ క్రిమిటోరియం మెషిన్ను వాడుకలోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
తలనీలాలు తీసే స్థలం ఏర్పాటు గురించి, స్మశాన వాటికకు ఆనుకొని ఉన్న మూసి పక్కన స్థలాన్ని స్మశాన వాటికకు వచ్చే వారు కూర్చునే విధంగా తీర్చిదిద్దడం, ఎదురుగా ఉన్న స్థలంలో పార్కింగు ఏర్పాటు చేయడం ఇతర సంబంధిత అంశాల గురించి చర్చించారు.