బీచుపల్లి పుణ్య క్షేత్రంలో కృష్ణా నది సమీపాన వెలసిన శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం లో 11వ తేదీన ఆదివారం పునర్వసు నక్షత్రం రోజున శ్రీ సీతా రాములవారి కళ్యాణం నిర్వహిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా, ఇటిక్యాల మండలం,శ్రీ బీచుపల్లి పుణ్యక్షేత్రంలో కృష్ణా నది సమీపాన వెలసిన శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం లో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ మేనేజర్ సురేంద్ర రాజు తెలియజేశారు.
ఆదివారం రోజున,పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. స్వామివారి కల్యాణం లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి ఆనందించ గలరని ఆయన కోరుతున్నారు. కళ్యాణం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని భక్తులందరిని కోరారు. పాలక మండలి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మేనేజర్ తెలిపారు.