యూత్ పార్లమెంట్ ఎంతగానో ఆకట్టుకుందని ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సంతోషం వ్యక్తం చేశారు. పెదవేగిలోని నవోదయ పాఠశాలలో నేడు జరిగిన 24వ నేషనల్ యూత్ పార్లమెంట్ కాంపిటీషన్ లో ఆయన ప్రసంగించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి యూత్ పార్లమెంట్ ను ప్రారంభించారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు. అనంతరం విద్యార్ధులు పార్లమెంట్ తరహాలో కూర్చుని ప్లాస్టిక్ నిషేధం, వ్యవసాయం, ఐటీ మరియు వైద్య రంగాలపై యూత్ పార్లమెంట్ లో చర్చించారు. యూత్ పార్లమెంట్ కార్యక్రమం చాలా బాగుందని ఎమ్మెల్యే అభినందించారు. విద్యార్థులకు పార్లమెంటరీ విధానంపై మరియు పార్లమెంట్ పనితీరుపై విద్యార్థి దశలోనే అవగాహన కల్పించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, పాఠశాల ఉపధ్యాయులు, విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
previous post