40.2 C
Hyderabad
May 2, 2024 16: 09 PM
Slider ముఖ్యంశాలు

కామారెడ్డిలో ఓయూ జెఎసి చైర్మన్ సత్యనారాయణ భిక్షాటన

#OUJAC

కామారెడ్డిలో కేసీఆర్ కు ఓటు వేయవద్దని ఓయూ విద్యార్థి జెఎసి చైర్మన్ కంభంపాటి సత్యనారాయణ ప్రజలను కోరారు. మంగళవారం కామారెడ్డి జిల్ కేంద్రంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా, కేసీఆర్ కు ఓటు వేయవద్దని ఓయూ విద్యార్థి సంఘటన సమితి ఆధ్వర్యంలో భిక్షాటన చేపట్టారు. ఈ సందర్బంగా ఓయూ విద్యార్థి జెఎసి చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణలో 92 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని కేసీఆర్ ప్రకటించాడని, ఉద్యోగాలు ఇవ్వకుండా దొంగ మాటలు చెప్పాడన్నారు. అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి అంటూ ఊరించాడని, 28 వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీ అని 18 వేలు అని చివరికి 5 వేలు భర్తి చేశాడన్నారు.

కేసీఆర్ ఓటమికి తిరుగుతా అని గతంలోనే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. గజ్వేల్ ప్రజలను పీల్చి పిప్పిచేశారని, అక్కడ ఒడిపోతాడని తెలిసి ఇప్పుడు కామారెడ్డి వచ్చారని తెలిపారు. కామారెడ్డిలో భూములు అమ్ముకోవడానికే కేసీఆర్ వస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి మోసం చేసిన కేసీఆర్ ను ఓడించి రాజకీయ నిరుద్యోగిని చేయాలని పిలుపునిచ్చారు. లక్షల అప్పు చేసి ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే ప్రశ్నాపత్రాలు లీకేజీ చేశారని, లికేజీలపై సిట్ వేసినా ఇప్పటికి అతిగతి లేదని, టీఎస్పీఎస్సి పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇక్కడ కేసీఆర్ పై పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డికి ఓటేసి గెలిపించాలని కోరారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

రక్షణ మంత్రి రాజ్ నాథ్ తో భేటీ అయిన రఘురాముడు

Satyam NEWS

ఆదర్శ కమ్యూనిస్టు నేత దివంగ‌త‌ కామ్రేడ్ మొకర అప్పారావు

Satyam NEWS

విలాసాలకు మరిగిన యువకులు చోరీలు చేస్తూ…

Satyam NEWS

Leave a Comment