ప్రతీ ఏటా ఆషాఢ మాసం శుద్ధ ద్వితీయ (విదియ) నాడు శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర జరగడం ఎన్నో వేలనాటి నుంచీ వస్తున్న సనాతన ఆచారం. సరిగ్గా జూన్ 20 వ తేదీన జగన్నాథ రథయాత్ర రావడంతో ఆ జగన్నాధుడు జన్మించిన ఒడిశా రాష్ట్రం పూరీలో అంగరంగ వైభవంగా పూరీ జగన్నాధుని రథయాత్ర ప్రారంభం కాగా…విజయనగరం లో కూడా ఆ జగన్నాధుడు కొలువైనాడు.
నగరంలో దాసన్నపేట వద్ద అలాగే దొమల(తోమాల)మందిరం వద్ద జగన్నాథు రథయాత్ర పై భక్తులకు దర్శనం ఇచ్చాడు. ఈ మేరకు ఆలయ ధర్మ కర్తలు.. నిర్వాహకులు దగ్గరుండి… నగరంలో ని మంగళవీధి సమీపంలో కన్యకాపరమేశ్వరి టెంపుల్ వద్ద భక్తుల సందర్శనార్ధం…జగన్నాధుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలతో రధం తీసుకు రావడంతో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు.