ఎవరి అభిప్రాయాన్ని తీసుకోకుండా ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఉన్న గురుకుల పాఠశాలను మల్లంపల్లికి తరలించడం అన్యాయమని ములుగు జిల్లా బిజెపి పార్టీ దళిత మోర్చా కార్యవర్గ సభ్యులు దుర్గ నరసింహారావు అన్నారు. ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్థానిక ఎమ్మెల్యే సీతక్క, జిల్లా పరిషత్ ఛైర్మన్ కుసుమ జగదీష్ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన అన్నారు. మల్లంపల్లి లో నీరు సరిగా లేకపోవడం వల్ల విద్యార్ధులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. గత ఏడాది వరకూ ఏటూరునాగరంలో నడిచిన గురుకుల పాఠశాలను అకస్మాత్తుగా ఎందుకు తరలించారో వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా రాత్రికి రాత్రే గురుకులాన్ని ములుగు జిల్లా మల్లంపల్లి మండలానికి తరలించడం జరిగింది. దళితులపై ఇంత చిన్నచూపు ఎందుకని ఆయన ప్రశ్నించారు.
previous post