టైర్ల మైలేజీ లో ఉత్తమ డిపో గా నిలిచిన గుంటూరు జిల్లా నరసరావుపేట ఏ పీ ఎస్ ఆర్ టి సీ డిపో మేనేజర్ ఎస్.కె అబ్దుల్ సలామ్ ను జోనల్ ఈడి గిడుగు వెంకటేశ్వరరావు అభినందించారు. గుంటూరు డిపోలో జరిగిన అభినందన సభలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నరసరావుపేట డిపో ని ఆదర్శంగా తీసుకుని మిగతా డిపోలు కూడా అత్యధిక టైరు మైలేజి సాధించాలని సూచించారు. నరసరావుపేట డిపో మొత్తం 2.70లక్షల కిలోమీటర్ల టైర్ మైలేజీ సాధించి జోనల్ స్థాయిలో రికార్డు సాధించింది. ఈ సందర్భంగా నరసరావుపేట డిపో గ్యారేజీ ఇంచార్జ్ లావణ్య, టైర్ మెకానిక్ కోటేశ్వర రావుని కూడా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు రీజినల్ మేనేజర్ రాఘవ కుమార్ డిప్యూటీ సీఎంఈ శరత్ బాబు, నరసరావుపేట డిప్యూటీ సీటీయమ్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.