శ్రీ శ్రీ శ్రీ భక్త కనకదాసు 533వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో BJPజాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ పాల్గొన్నారు.
ముందుగా డీకే అరుణ శ్రీ భక్త కనకదాసు విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ శ్రీ శ్రీ శ్రీ భక్త కనకదాసు కురువ కులస్తులకు ఆరాధ్య దైవం అని అన్నారు.
గత సంవత్సరం చింతల కుంట గ్రామంలో విగ్రహాన్ని ప్రతిష్టించి కురువ కులస్తుల కోరిక నెరవేర్చామని ఆమె తెలిపారు. కర్ణాటక ప్రాంతంలో భక్త కనక దాసు ఎన్నో రచనలు చేశారని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లు నందిన్నె ప్రకాశ్ రావ్, గడ్డం కృష్ణా రెడ్డి, bjp జిల్లా అధ్యక్షులు రాంచంద్రారెడ్డి పట్టణ అధ్యక్షులు బండల వెంకట్రాములు రామాంజనేయులు,
బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి కేటి దోడ్డి మండల బిజెపి పార్టీ యూత్ అధ్యక్షుడు నందిన్నె మహాదేవ్ జిల్లాకిసాన్ మోర్చాకార్యదర్శి rk కుశ కేటిదోడ్డి
మండల బిజెపి బిసిసెల్ అధ్యక్షుడు rk రాముడు కుల సంఘం పెద్దలు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.