నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఘోరం జరిగింది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ఆయన భార్య దారుణంగా హతమార్చింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెంలో గందల మణి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
ఈ విషయం గుప్పుమనడంతో ఆ ప్రాంతం అంతా సంచలనం కలిగింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కోపంతో భర్తని ప్రియుడితో కలిసి భార్య హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. భార్య, ప్రియుడు కలిసి భర్త మణిని అర్ధరాత్రి హత్య చేసి గోనిసంచిలో మూటగట్టి పక్కనే ఉన్న నక్కల కాలవలో పడేశారు. మృతదేహం కోసం పోలీసుల కాలువలో గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.