అన్నమయ్య జిల్లా రాజంపేటలో సోమవారం నారా లోకేష్ పాదయాత్ర 100 లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజంపేటలో సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు, రాజంపేట టీడీపీ పార్లమెంట్ ఇంచార్జీ గంటా నరహరి టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కూచివారి పల్లె ఎన్టీఆర్ విగ్రహం నుంచి పట్టణ వీధుల వెంబడి కొత్త బోయిన పల్లె మహలక్షుమ్మ గుడి వరకు ఈ పాదయాత్ర నిర్వహించారు.
మహలక్షుమ్మ గుడిలో ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారా లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా 100 రోజులు పూర్తి చేసుకోవడం పట్ల టీడీపీ ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు, రాజంపేట టీడీపీ పార్లమెంట్ ఇంచార్జీ గంటా నరహరి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం ఖాయమని భత్యాల చెంగలరాయుడు ఎమ్మెల్యే గా, తాను ఎంపీగా అత్యధిక మెజార్టీ తో గెలవడం ఖాయమని రాజంపేట టీడీపీ పార్లమెంట్ ఇంచార్జీ గంటా నరహరి తెలిపారు.