నూతన సంవత్సరం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భారీ కేక్ ను కట్ చేశారు.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జూపల్లి వర్గీయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనుచర వర్గానికి, ప్రజాప్రతినిధులకు,కార్యకర్తలకు జూపల్లి కేక్ తినిపించారు.
అదేవిధంగా పత్రిక మీడియా మిత్రులకు జూపల్లి కేక్ తినిపించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ షేక్ రహీం పాషా, మాజీ సర్పంచ్ మేకల నాగరాజు ,కౌన్సిలర్ మాచుపల్లి బాలస్వామి,
సింగిల్ విండో నెంబర్ నరసింహ, మేకల కిషోర్ యాదవ్, కిరణ్ యాదవ్,బోరెల్లి మహేష్,రెడ్డి సత్యం, అన్వర్, దిలీప్ ,రాఘవేంద్ర ఎగ్బాల్,
పశుల వెంకటేష్, ప్రిన్స్ బాబా,శేఖర్ రామదాసు,బికే మధు,బాల స్వరూప్, రమేష్ గౌడ్,వెంకటేష్ బాలరాజు,ముస్తక్ తదితరులు ఉన్నారు.