అమరావతిని కాపాడుకోవడానికి ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమానికి విరాళంగా నారా భువనేశ్వరి తన చేతికి ఉన్న గాజులు తీసి ఇచ్చేశారు. ఎర్రబాలెం రైతు దీక్షకు మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడితో సహా ఆమె హాజరయ్యారు. రైతుల దుస్థితి చూడలేకపోతున్నానని ఈ సందర్భంగా భువనేశ్వరి అన్నారు.
నా తోటి మహిళల బాధలు నేను అర్ధం చేసుకోగలను. చంద్రబాబు ఆరోగ్యం గురించి మేము ఆందోళన చెందినా ఆయన మాత్రం రాష్ట్రం గురించే ఆలోచన చేసేవారని భువనేశ్వరి అన్నారు. ప్రజల తరువాతనే తను, కుటుంబాన్ని పట్టించుకునే వారని ఆమె అన్నారు. అమరావతి రైతుల నమ్మకాన్ని చంద్రబాబు వొమ్ము చేయరని భువనేశ్వరి విశ్వాసం వ్యక్తం చేశారు.
భోజనం చేసినా, పడుకున్నా అమరావతి, పోలవరం అనే తపించారని చంద్రబాబు గురించి ఆమె చెప్పారు. ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ప్రజల కోసమే కష్టపడ్డారని ఆమె చెప్పారు. ఆందోళన చేస్తున్న రైతులకు పూర్తి మద్దతుగా తమ కుటుంబం అండ ఉంటుందని భువనేశ్వరి చెప్పారు.